గోల్కొండలో ఈనెల 26 నుంచి ప్రారంభం కానున్న జగదాంబికా అమ్మవారి బోనాలకు సంబంధించి సన్నాహక సమావేశాన్ని మంగళవారం మధ్యాహ్నం మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ బోనాలకు సంబంధించి నాగదేవత పుట్ట వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈసారి బోనాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బోనాలలో భక్తులు భారీగా పాల్గొంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కలెక్టర్ హరిచందన అధికారులు పాల్గొన్నారు.