Download Now Banner

This browser does not support the video element.

నిజామాబాద్ సౌత్: కలెక్టరేట్లో మట్టి గణనాథులను పంపిణీ చేసిన బోధన్ ఎమ్మెల్యే సురేష్ రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి n

Nizamabad South, Nizamabad | Aug 26, 2025
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్) లో మంగళవారం బోధన్ శాసన సభ్యులు సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ఉద్యోగులకు మట్టి గణపతులు పంపిణీ చేశారు. వినాయక చవితి వేడుకను పురస్కరించుకుని జిల్లా రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ ద్వారా కొనసాగుతున్న హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి గణపతులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ కోసం మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేస్తుండడం ప్రశంసనీయమని ఫౌండేషన్ నిర్వాహకులను అభినందించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us