బాల్కొండ నియోజకవర్గంలో రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలో శనివారం ఆయన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.. రైతుల గోస పట్టించుకోకుండా యూరియా కోసం రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. యూరియా దొరకకపోతే రైతులు నష్టపోయే పరిస్థితి ఉందన్నారు. వెంటనే రైతులకు సరిపడా యూరియాను అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.