అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలంలో వినాయకచవితి వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలని తాడిపత్రి అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి సూచించారు. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో సోమవారం వినాయక చవితి వేడుకలపై నిర్వాహకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి మాట్లాడుతూ వినాయక చవితి వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలు నిర్వహించుకోవాలన్నారు. విగ్రహాలు ఏర్పాటు చేసే ప్రతి ఒక్కరూ పోలీసు అనుమతులు తప్పకుండా తీసుకోవాలని కోరారు. చవితి వేడుకల సందర్భంగా ఎవరైనా ఘర్షణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.