చుంచుపల్లి మండల పరిధిలోని పెనగడప అంబేద్కర్ నగర్ కు చెందిన శేషగిరి రోడ్డు పక్కన సోమవారం ఆటోను నిలిపి అద్దం తుడుస్తుండగా సత్తుపల్లి వైపు నుండి అతివేగంగా వచ్చిన బొగ్గు టిప్పర్ శేషగిరిని ఢీకొంది.. ఈ ప్రమాదంలో ఆటో నుజునుజు కాక, శేషగిరి కి తీవ్ర గాయాలయ్యాయి.. స్థానికులు కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఓ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.. శేషగిరి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు.. పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించాల్సి ఉంది..