శ్రీశైలం మహాక్షేత్రంలో ఈరోజు ఐదవ శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని దేవస్థానం ఆధ్వర్యంలో ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతం ఘనంగా నిర్వహించారు.ఆలయ ఉత్తర భాగంలోని చంద్రావతి కల్యాణ మండపంలో జరిగిన వరలక్ష్మి వ్రతంలో 650 మంది చెంచు గిరిజన మహిళలు ముత్తైదువులు అలానే 1000 మంది సాధారణ మహిళ ముత్తయిదువులు పాల్గొన్నారు.వరలక్ష్మీ వ్రతంలో పాల్గొన్న మహిళలకు దేవస్థానమే ఉచితంగా వరలక్ష్మి వ్రత పూజా సామగ్రిని అలానే చీర,రవిక వస్త్రం కూడ అందజేసి వ్రతాన్ని శాస్త్రోక్తంగా వ్రత సంకల్పాన్ని పఠించి నిర్వీఘ్నంగా జరిపించారు.అనంతరం వ్రతంలో 90 గుడెలకు చెందిన 650 మంది చెంచు మహిళలు పాల్గొన్నారు.