షాద్నగర్ మలయాళ స్వామి ఆశ్రమ స్వామీజీ దయానంద అలియాస్ రామ్ రెడ్డి అవినీతి అక్రమాలపై అధికారులు విచారణ జరపాలని ఫరూఖ్నగర్ మండలం దేవునిపల్లి గ్రామస్థులు డిమాండ్ చేశారు. గ్రామంలో ఓ స్థల వివాదంపై రేగిన అలజడిపై వారు స్పందించారు. ఆశ్రమ భూమిని స్వామి భార్యపై ఎందుకు బదలాయింపు చేశారని, ఆధ్యాత్మికత కోసం ఇచ్చిన భూమి ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు.