ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద పోటెత్తుతోంది. ఆచంట మండలంలోని పెదమల్లం, భీమలాపురం, కరుగోరుమిల్లి పుష్కర ఘాట్లు వరద నీటిలో మునిగిపోయాయి. ఏటిగట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లంక గ్రామ ప్రజలను హెచ్చరించి, వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. వరద తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.