Download Now Banner

This browser does not support the video element.

పాడి గ్రామానికి వెళ్లే రహదారి మధ్యలో ఉన్న కొండవాగుపై వంతెన నిర్మించాలని కోరుతున్న స్థానికులు, ప్రయాణికులు

Paderu, Alluri Sitharama Raju | Sep 9, 2025
కొయ్యూరు మండలంలోని కొండగోకిరి పంచాయతీ పరిధిలో ఉన్న పాడి గ్రామానికి వెళ్లే రహదారి మధ్యలో ఉన్న కొండవాగుపై వంతెన నిర్మించాలని మంగళవారం సాయంత్రం జుర్రా శివకుమార్, పలువురు స్థానికులు కోరుతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కొండవాగు ఉప్పొంగి, ఉధృతంగా ప్రవహిస్తోందన్నారు. దీంతో ఆ రహదారి గుండా వెళ్లే పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినా కానీ అక్కడ కొండవాగుపై బ్రిడ్జి నిర్మించడం లేదన్నారు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us