అన్నపురెడ్డి పల్లి మండలం రాజాపురం గ్రామంలో ఎయిర్టెల్ కు చెందిన సెల్ ఫోన్ టవర్ నిర్మాణాన్ని గ్రామస్థులు అడ్డగించారు. తమ నివాస గృహాల మధ్య సెల్ ఫోన్ టవర్ ను నిర్మించడానికి వీలు లేదని అన్నారు. దాని నుండే వచ్చే అధిక రేడియేషన్ వల్ల చిన్న పిల్లలు, వృద్ధులు, పక్షులు అనారోగ్యానికి గురి కావాల్సి వస్తది అన్నారు. అందుకే తక్షణమే సెల్ టవర్ నిర్మాణం ఆపేసి గ్రామ శివారులో ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. తక్షణమే నిర్మాణ పనులు నిలిపివేయకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించిన గ్రామస్తులు..