ఎల్లారెడ్డి : బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మర్రి బాలకిషన్, ఏకాత్మ మానవతా వాద సిద్ధాంతకర్త, అంత్యోదయ స్ఫూర్తిప్రధాత శ్రీ పండిట్ దీనదయాల్ అని అన్నారు. ఎల్లారెడ్డి బీజేపీ కార్యాలయంలో గురువారం దీనదయాల్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సమగ్ర మానవతా వాద సిద్ధాంత ప్రతిపాదకులు, భారతీయ జనసంఘ్ పార్టీ నాయకుడిగా ఆయనను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు నర్సింలు, దివిటీ రాజేష్, పద్మ శ్రీను, బత్తిని దేవేందర్, ఎస్ ఎన్ రెడ్డి, కాశీనాథ్, అల్లం పండరి, గజనాన్ పాల్గొన్నారు.