Kavali, Sri Potti Sriramulu Nellore | Sep 13, 2025
బోగోలు మండలంలోని సచివాలయ ఉద్యోగులు అధిక అదనపు బాధ్యతల వల్ల ఒత్తిడికి గురవుతున్నారని వాపోయారు. శనివారం బోగోలు జూనియర్ అసిస్టెంట్ సరితకు వినతిపత్రం అందజేసి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. GSWS శాఖలో పని చేసే ఉద్యోగులకు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు చాలా తేడా ఉందని కూడా తెలిపారు. ఈ కార్యక్రమం శనివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జరిగింది.