ప్రకాశం జిల్లా దోర్నాల ఫారెస్ట్ కార్యాలయం నందు జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా అడవులు వన్య ప్రాణుల రక్షణ కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరుల చిత్రపటాలకు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అడవి సంపదన కాపాడుకునేందుకోసం ప్రాణాలు సైతం లెక్కచేయకుండా కృషి చేసిన వారి త్యాగాలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో దోర్నాల కుర్రపోలు రేంజర్లు హరి కాజా రెహమతుల్లా ఫారెస్ట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.