గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో గల కెజిబివి పాఠశాలను ఎమ్మెల్యే జగదీశ్వరి గురువారం సందర్శించారు. ఈ మేరకు పాఠశాల విద్యార్థులతో మాట్లాడి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అలాగే విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు పంపిణీ చేసి శ్రద్ధగా చదువుకొని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రీరంజని, మండల కన్వీనర్ సుదర్శనరావు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.