ఎమ్మిగనూరులో 28 బస్తాల అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ పట్టివేత..ఎమ్మిగనూరు పట్టణంలోని ఉప్పర కాలనీలో శనివారం పోలీసులు అక్రమంగా నిల్వ ఉంచిన 28 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. టౌన్ ఎస్సై మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన దాడుల్లో రేకుల షెడ్ లో ఈ బియ్యం బస్తాలను గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.