ఏలూరు జిల్లా చింతలపూడి మండలం గురుభట్లగూడెంలో గురువారం సాయంత్రం 4గంటలకు పురాతన గంగిరెద్దుల విన్యాసాలు ప్రజలను అలరించాయి. ఈ సందర్భంగా పూర్వపు రోజుల్లో జానపద కళలు సంస్కృతిని గుర్తు చేసిందని స్థానికులు తెలిపారు. ఈ కళలను భావితరాలకు తెలియచెప్పాలనే ఉద్దేశంతో కార్యక్రమం నిర్వహించినట్లు వారు తెలిపారు.