Kandukur, Sri Potti Sriramulu Nellore | Aug 23, 2025
కందుకూరులో ఆంధ్రకేసరి సేవాసమితి ఆధ్వర్యంలో శనివారం టంగుటూరి ప్రకాశం పంతుల జయంతిని చేశారు. కోవూరు రోడ్డులో గల ఆయన విగ్రహానికి సబ్ కలెక్టర్ హిమవంశితో పాటు పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వక్తలు మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరంలో ప్రకాశం పంతులు చేసిన త్యాగాలు, చూపిన ధైర్యసాహసాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి కావాలని సూచించారు.ఈ కార్యక్రమం శనివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో జరిగింది .