ఒంటిమిట్ట మండల పరిధిలోని నరవకాటుపల్లి అరుంధతి వాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పైకప్పు పెచ్చులు ఊడుతున్నాయని టీడీపీ నాయకుడు గఫూర్ రెహమాన్ పేర్కొన్నారు. పిల్లలు బిక్కుబిక్కుమంటూ విద్యను అభ్యసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో అనేకసార్లు ప్రభుత్వ అధికారులకు అర్జీలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. అయినా ఎవరూ స్పందించలేదని, ప్రస్తుత కూటమి ప్రభుత్వమైన వెంటనే స్పందించాలని వారు కోరారు.