అమీన్పూర్ పరిధిలోని ది గ్రేస్ వృద్ధాశ్రమాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య గురువారం పరిశీలించారు. జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా ఈ సందర్శన జరిగిందని తెలిపారు. వృద్ధులతో మాట్లాడి వారి బాగోగులను అడిగి తెలుసుకున్న సౌజన్య, వారికి అవసరమైన న్యాయ సహాయాన్ని ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, వృద్ధులు తదితరులు పాల్గొన్నారు.