పాల్వంచ పట్టణంలోని విశాల సహకార సంఘం సొసైటీ వద్ద యూరియా కొరతపై రైతులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. బీఆర్ఎస్, సీపీఎం పార్టీల ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన ఈ ధర్నాలో వందలాది మంది రైతులు పాల్గొన్నారు. రాష్ట్రానికి అవసరమైన యూరియాను వెంటనే సరఫరా చేయాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 3 లక్షల టన్నుల యూరియా అవసరం ఉండగా, కేవలం 18 వేల టన్నులు మాత్రమే అందుబాటులో ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి,వరి,మిరప వంటి పంటలకు యూరియా అత్యవసరం అని రైతులు పేర్కొన్నారు.