తాండూరు మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆదివాసులు చేపట్టిన రిలే నిరాహార దిక్షకు సిపిఐ నాయకులు మద్దతు గా నిల్చారు నర్సాపూర్ గ్రామంలో నెలకొన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెక్ పోస్ట్ నుండి నాలుగు గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి బ్రిడ్జి కుంగి పోయి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు బెజ్జల వరకు అటవీ శాఖ వారు అనుమతులు ఇవ్వాలని వారు కోరారు