Download Now Banner

This browser does not support the video element.

భీమవరం: జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం

Bhimavaram, West Godavari | Sep 1, 2025
ప్రజా ఫిర్యాదులు పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ మరల మరల అర్జీలు పునరావృతం కాకుండా నిర్ణీత గడువులోగా  చట్ట పరిధిలో శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం నాలుగు గంటల వరకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ నిర్వహించారు. వివిధ రకాల సమస్యలతో వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను ఎస్పీ స్వయంగా స్వీకరించి వారి సమస్యలను విని, సానుకూలంగా స్పందించి, వారి సమస్యలపై పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కారం అందిస్తామని భరోసా ఇచ్చారు.
Read More News
T & CPrivacy PolicyContact Us