మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం బంజర తండ గ్రామానికి చెందిన బానోత్ కుమార్ (25) సోమవారం తన వ్యవసాయ బావి వద్ద మోటార్ ఆన్ చేస్తూ విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషాద సంఘటన స్థానికంగా కలకలం రేపింది