తెలంగాణ విద్యా విధానంలో మార్పులు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎడ్యుకేషన్ పాలసీ కమిటీలో ముస్లిం వర్గాలకు చెందిన విద్యావంతులకు కూడా స్తానం కల్పించాలని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి ఎండి. యాకూబ్ పాషా గురువారం ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ విద్యా విధానాన్ని అమలు చేయడంలో, ఉద్యోగ అవకాశాలు, విద్యా నైపుణ్యం, డిజిటల్ విద్యా విధానం, కొత్త ఆవిష్కరణలు వంటి పలు అంశాలు అధ్యయనం చేయడానికి చైర్ పర్సన్ తో పాటు 6 గురు సభ్యులను నియమించగా,ముస్లిం వర్గానికి చెందిన వారికి ఒక్కరికి కూడా స్థానం దక్కలేదని అన్నారు