ఎల్లారెడ్డిలో గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా, సోదరభావంతో నిర్వహించుకోవాలని ఆర్డీవో పార్థ సింహారెడ్డి శుక్రవారం సాయంత్రం అన్నారు. శుక్రవారం ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో గణేష్ ఉత్సవాల పై పలు ప్రభుత్వ శాఖలు, పొలిటికల్ పార్టీలు, మత పెద్దల ప్రతినిధులతో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. గణేష్ ఉత్సవాల నిర్వహణపై హిందూ, ముస్లిం ప్రతినిధుల అభిప్రాయాలు, సూచనలు ఆర్డీవో స్వీకరించారు. ఆర్డీవో మాట్లాడుతూ.. గణేష్ ఉత్సవాలు సామాజిక సమైక్యతకు ప్రతీకగా నిలవాలని, ప్రతి ఒక్కరు స్నేహపూర్వకంగా జరుపుకోవాలని కోరారు. ప్రజల ఆచార సంప్రదాయాలకు భంగం కలగకుండా ఉత్సవాలు జరుపుకోవాలీ.