రామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరిపై పొక్సో కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒకరిని పోలీసులు రిమాండ్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. రామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తిపై ఆయన కూతురు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను బూతు మాటలు తిడుతున్నాడని, ఇబ్బందులకు గురి చేస్తున్నాడని పేర్కొంది. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. అయితే తన కూతురు విషయంలో ఓ బాలుడు వ్యవహరించిన తీరుపై బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.దీంతో సదరు బాలుడిపై సైతం పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఇద్దరిపై కేసు నమోదు