రేపు సురుటుపల్లి ఆలయంలో దరఖాస్తుల పరిశీలన నాగలాపురం మండలం సురుటుపల్లి శ్రీపల్లికొండేశ్వర స్వామి ఆయల నూతన పాలకమండలి నియామకానికి 98 మంది దరఖాస్తు చేసుకున్నారు. దేవదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు దరఖాస్తులను గురువారం ఉదయం 9 గంటల నుంచి పరిశీలిస్తామని ఆలయ ఈవో లత తెలిపారు. అభ్యర్థులు ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికేట్, అఫిడవిట్, ఆధార్ కార్డు, పాస్ పోర్ట్ సైజు ఫోటో-1 తప్పక తీసుకురావాలన్నారు.