చేవెళ్ల మండల పరిధిలోని ఆలూరు గ్రామంలో ఎంపీ లాండ్స్ నిధులతో నూతనంగా చేపట్టనున్న సిసి రోడ్ నిర్మాణ పనులకు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గురువారం మధ్యాహ్నం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేవెళ్ల మండల పరిధిలోని గ్రామాల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నామని తెలిపారు. కేంద్రంలోని బిజెపి గ్రామాల అభివృద్ధికి భారీగా నిధులు వెచ్చిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు.