Kandukur, Sri Potti Sriramulu Nellore | Sep 10, 2025
కందుకూరు పట్టణం పామూరు రోడ్డులో త్యాగరాజ స్వామి గుడి ఎదురుగా ఉన్న మున్సిపాలిటీ షాపు మెట్లపై గుర్తు తెలియని శవం కనిపించడం స్థానికుల్లో కలకలం రేపింది. బుధవారం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల ప్రాంతంలో పాదచారులు శవాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆయన గురించి తెలిసిన వారు తమకు సమాచారం ఇవ్వాలని SI కోరారు.