ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పట్టవా అని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మీరాజా కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆదివారం ఉదయం కడపలోని యుటిఎఫ్ భవన్లో యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు మాదన విజయ కుమార్ అధ్యక్షతన జరిగిన ఆ సంఘ జిల్లా మధ్యంతర కౌన్సిల్ సమావేశంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని ప్రసంగించారు.