Download Now Banner

This browser does not support the video element.

జనగాం: జిల్లా కేంద్రంలో సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి మృతికి సంతాపం తెలిపిన సీపీఐ నాయకులు

Jangaon, Jangaon | Aug 23, 2025
పేద ప్రజల కోసం,కార్మికులు, కర్షకుల కోసం నిరంతరం పోరాడిన మహానీయుడు సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అని సీపీఐ జనగామ పట్టణ కార్యదర్శి సొప్పరి సోమయ్య అన్నారు.అమరజీవి సురవరం సుధాకర్ రెడ్డి మృతి పట్ల శనివారం జనగామ పట్టణ కేంద్రంలో ఆ పార్టీ నాయకులు సంతాపం తెలియజేశారు.ఈ సందర్భంగా సోమయ్య మాట్లాడుతూ AISF సభ్యుడి నుండి సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగారని గుర్తు చేశారు.పేద ప్రజల కోసం కార్మికులు,కర్షకుల కోసం నిరంతరం పోరాడిన మహానీయుడని కొనియాడారు.
Read More News
T & CPrivacy PolicyContact Us