Download Now Banner

This browser does not support the video element.

చెన్నూరు: జాతీయ స్థాయి ఆత్య పాత్యా పోటీలకు ఎంపికైన జిల్లా క్రీడాకారులు

Chennur, Mancherial | Sep 12, 2025
ఇటీవల మందమర్రి మండలం రామకృష్ణాపూర్ ఠాగూర్ స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఆత్య పాత్యా పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎంపికవడం అభినందనీయమని క్రీడా నిర్వాహక అద్యక్షులు గాండ్ల సమ్మయ్య, ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి ఉప్పలయ్య అన్నారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం జాతీయ స్థాయికి ఎంపికైన క్రీడాకారులను వారు ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు. ఈ నెల 19వ తేదీ నుండి 21వ తేదీ వరకు మహారాష్ట్ర బుల్ధానలో జరిగే పోటీల్లో క్రీడాకారులు పాల్గొంటారని పేర్కొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us