మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గురువారం రాత్రి 8 గంటల సమయంలో మడకశిర పట్టణంలోని సంత మార్కెట్ ఆటో స్టాండ్ ల వద్ద పర్యటించారు. రాత్రిపూట ఎమ్మెస్ రాజు రోడ్లపైకి రావడంతో ప్రజలు గమనించి ఆయన వద్దకు చేరుకొని పలు సమస్యలు ఆయన దృష్టికి తెచ్చారు. ప్రజలు తెచ్చిన సమస్యలు తక్షణమే పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలని అధికారులకు సూచించారు.