దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకుల మండలం రాచాల-పొన్నల్ రహదారిపై రాయికంటి ఎల్లమ్మ గుడి వద్ద జరుగుతున్న మరమ్మతు పనుల కారణంగా శనివారం రాకపోకలను నిలిపివేశారు. ప్రయాణికులు నాగయ్యపల్లి మార్గం ద్వారా ప్రయాణించాలని గ్రామస్తులు సూచించారు. అధికారులు, పోలీసులు, రోడ్డు సిబ్బంది సమన్వయంతో పనులు పూర్తి చేస్తున్నారు. ఈ తాత్కాలిక అసౌకర్యాన్ని గమనించి సహకరించాలని కోరారు.