హైకోర్టు తీర్పును అమలు చేయాలని ధర్నా చేసిన విద్యార్థి నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకుడు కంచర్ల రవి గౌడ్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం పరిధిలోని సిరిసిల్లలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. బీఆర్ఎస్ నిరుద్యోగులకు అండగా నిలబడుతుందని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేయడం లేదన్నారు.