బైరెడ్డిపల్లి: మండలం గంగినాయన పల్లి గ్రామంలో వెంకటరమణారెడ్డి అనే వ్యక్తి పొలం వద్దకు వెళ్లి గ్రామంలోకి వస్తూ ఉండగా, ఓ కుక్క హఠాత్తుగా ఆ వ్యక్తిపైకి వచ్చి రెండు కాళ్లు గాయాలయ్యే విధంగా కొరికేసింది. స్థానికుల సహాయంతో బాధితుడిని ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యం అందించారు. కాగా గ్రామంలో కుక్కలు బెడద ఎక్కువ కావడంతో, ఈ సంఘటనలు జరుగుతున్నాయని అధికారులు పట్టించుకుని కుక్కల బారి నుండి ప్రజలకు హాని కలగకుండా చూడాలని కోరుతున్నారు గ్రామస్తులు.