సూర్యాపేట జిల్లా తుంగతుర్తి లోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల ముసాయిదా ఓట్ల జాబితాన గురువారం ఎంపీడీవో శేషు కుమార్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఇట్టి జాబితా పై అభ్యంతరాలు ఉంటే ఈనెల 28 నుంచి 30 వరకు స్వీకరించబడుతుందన్నారు. తుది ముసాయిదా ఓటర్ జాబితాను సెప్టెంబర్ 2 నుంచి జిల్లా పంచాయతీరాజ్ అధికారి ప్రకటిస్తారని తెలిపారు .ఈ కార్యక్రమంలో ఎంపీఓ సందీప్ కార్యదర్శి శ్రీనివాస్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.