Download Now Banner

This browser does not support the video element.

కనిగిరి: గ్రామాల్లో కొత్త వ్యక్తులు సంచరిస్తున్నట్లు అనుమానం ఉంటే వెంటనే పోలీసులకు తెలపాలి: హనుమంతునిపాడు ఎస్ఐ మాధవరావు

Kanigiri, Prakasam | Aug 18, 2025
హనుమంతునిపాడు: గ్రామాల్లో కొత్త వ్యక్తులు సంచరిస్తున్నట్లు అనుమానం ఉంటే వెంటనే ఆ సమాచారాన్ని పోలీసులకు తెలపాలని హనుమంతునిపాడు ఎస్సై కే మాధవరావు సూచించారు. సోమవారం రాత్రి మండల కేంద్రమైన హనుమంతునిపాడులో స్థానికులతో ఎస్సై మాధవరావు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రామంలో దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామస్తులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, కొత్త వ్యక్తుల కదలికలను సీసీ కెమెరాలు ద్వారా తెలుసుకోవచ్చన్నారు. అదేవిధంగా సైబర్ నేరాలపై కూడా ఎస్సై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us