పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం పెనుగొండ ఇండియన్ గ్యాస్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు. ఎస్సై గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం.. మునమర్రు గ్రామానికి చెందిన తానేటి సత్యానందం (37) తన మోటార్సైకిల్పై వెళ్తుండగా, వేగంగా వచ్చిన కూల్ డ్రింక్స్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలై సత్యానందం అక్కడికక్కడే మరణించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.