సొంత ఊరు అత్తిలికి ఏం చేశారో చెప్పాలని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావును తణుకు ఏఎంసీ చైర్మన్ కొండేటి శివ ప్రశ్నించారు. శుక్రవారం సాయంత్రం సుమారు 6 గంటలకు పశ్చిమగోదావరి జిల్లా తణుకులో మీడియాతో మాట్లాడారు. అప్పుడప్పుడు నియోజకవర్గానికి వచ్చి అధికార పార్టీ నాయకులపై బురద జల్లుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎక్కడా యూరియా కొరత లేదని అన్నారు