శ్రీశైలం దేవస్థానంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈవో శ్రీనివాసరావు గురువారం సాయంత్రం చేపట్టారు.ఇందులో భాగంగా శ్రీశైలం దేవస్థానంలో బ్రమరి పుష్పవనంలో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించారు.మొక్కల్లో 30% దేవత మొక్కలు నాటుతున్నామని, అందులో భాగంగా బిల్వ మొక్కలు నాటుతున్నమని, వర్షాకాలం ముగిసేలోపు 5వేల మొక్కలు నాటుతామని, అలాగే నీడనిచ్చే చెట్లను రోడ్డుకి ఇరువైపులా సుందరీకరణ చెట్లను పూల చెట్లను నాటుతామని ఈవో శ్రీనివాసరావు తెలియజేశారు.