ఏలూరు నుంచి HYD వెళ్తున్న కొబ్బరి బోండాల DCM వాహనం SRPT రాయన్జూడెం వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్కు గాయాలు కాగా, స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన జరిగిన వెంటనే స్థానికులు, ప్రయాణికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని డీసీఎం నుంచి కిందపడిన కొబ్బరి బోండాలను ఎగబడి ఎత్తుకెళ్లారు. వాహనదారులు, స్థానికులపై కేసు నమోదు చేయాలని డీసీఎం డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.