అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం ముదివేడు గ్రామ సమీపంలో బుధవారం మదనపల్లె నుంచి తంబళ్లపల్లె కు వెళ్తున్న ఆటో గ్రామ సమీప మలుపు వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించిబోయి ఆటో అదుపుతప్పి పంట పొలాల్లో దూసుకెళ్లి బోల్తా పడింది . ఆటోలో ప్రయాణిస్తున్న 11 మంది కూలీలు గాయపడ్డారు. గాయపడ్డ వారిని స్థానికులు మదనపల్లె జిల్లా ఆస్పత్రి తరలించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సలహా మేరకు తిరుపతి రుయా ఆసుపత్రి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.