మట్టి వినాయకులను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని, ప్రతి ఒక్కరిపై బాధ్యత ఉందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. శుక్రవారం కలెక్టర్ లో జిల్లా కాలుష్య నియంత్రణ మండలి మరియు స్పేస్ స్వచ్ఛంద సంస్థ రూపొందించిన "పర్యావరణ అనుకూల వినాయక చవితి అవగాహన కార్యక్రమం" కు సంబంధించిన గోడపత్రికలను, కరపత్రాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని, దీనిని దృష్టిలో ఉంచుకొని పర్యావరణానికి హితము చేసే మట్టి వినాయకులతోనే చవితి పండుగను జరుపుకోవాలని అన్నారు.