ఎల్లారెడ్డి : భారీ వరదతో కళ్ళేదుటే మెదక్ - ఎల్లారెడ్డి రహదారి ఘన్ పూర్ వద్ద మూతపడిందని ఎల్లారెడ్డి ఆర్డీఓ పార్థ సింహరెడ్డి అన్నారు. మంగళవారం లయన్స్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో వరద బాధితులకు 125 వరద కిట్లను తహసిల్ ఆఫీస్ ఆవరణలో పంపిణి చేసారు. ఈ సందర్బంగా ఆర్డీఓ మాట్లాడుతూ..వరదల వల్ల ఈ ప్రాంతంలో 450 ఇండ్లు దెబ్బతినగా, దాదాపు 10,000 ఎకరాల పంట దెబ్బ తిందన్నారు. లయన్స్ ఇంటర్నేషనల్ వారికీ ఆర్డీఓ అభినoదించారు.