సూర్యాపేట జిల్లా, తిరుమలగిరి మండలంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ విస్తృతంగా పర్యటించారు. బుధవారం సాయంత్రం మండలంలోని ఏ ఎస్ ఆర్ రైస్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మిల్లర్లను కొనుగోలు కేంద్రం నుండి వచ్చిన ధాన్యం లారీలను త్వరితగతిన భీమతి చేసుకోవాలని, హమాలీల సంఖ్య పెంచాలని ఆదేశించారు. అనంతరం తొండలోని ఐకెపి కేంద్రాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.