Download Now Banner

This browser does not support the video element.

పలమనేరు: వీ.కోట: రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొన్న ద్విచక్ర వాహనం, తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి

Palamaner, Chittoor | Sep 11, 2025
వీ.కోట: మండల పోలీస్ వర్గాలు గురువారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో తెలిపిన సమాచారం మేరకు. ఏడుచుట్ల కోట గ్రామానికి సమీపంలో శ్రీనివాసులు అనే వ్యక్తి రోడ్డు దాటుతున్న సమయంలో వీకోట నుండి తమిళనాడు వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో శ్రీనివాసులు తీవ్రంగా గాయపడ్డారు గమనించిన స్థానికులు హుటాహుటిన ఆయనను ఆసుపత్రికి తరలించి వైద్యం అందించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటి, పెద్దదిక్కు మరణించడంతో కన్నీరు మున్నీరయ్యారు కుటుంబీకులు.
Read More News
T & CPrivacy PolicyContact Us