గంజాయి సాగు, రవాణా, నాటుసారా తయారీ, క్రయ విక్రయాలకు దూరంగా ఉండాలని కొయ్యూరు సీఐ బీ.శ్రీనివాసరావు, ఎస్సై పీ.కిషోర్ వర్మ ప్రజలకు సూచించారు. కొయ్యూరు మండలం చీడిపాలెంలో గురువారం రాత్రి పర్యటించారు. గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. గంజాయి, డ్రగ్స్, నాటుసారా తదితర మత్తు పదార్థాల వినియోగం వల్ల జీవితాలు నాశనం అవుతున్నాయన్నారు. ఎవరైనా గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామన్నారు.