శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడంతో పాటు వర్షాల కారణంగా వరద వస్తోందని అధికారులు బుధవారం సాయంత్రం తెలిపారు. దీంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీళ్లు కిందకు వదిలే అవకాశం ఉందని పేర్కొన్నారు. నదీ పరివాహక ప్రాంతంలోకి ప్రజలు, చేపలు పట్టేవారు, పశువులు, గొర్రెల కాపరులు, రైతులు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు.