Mahadevpur, Jaya Shankar Bhalupally | Aug 25, 2025
క్షేత్ర స్థాయిలో యురియా అందడం లేదని వ్యవసాయ సహకార సంఘం ముందు ఆందోళన వ్యక్తం చేసిన రైతులు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మలహార్ రావు మండలం తాడిచేర్ల వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ముందు యూరియా ఇవ్వడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.ఈసందర్భంగా రైతులు మాట్లాడుతూ గత మూడు రోజుల నుండి వ్యవసాయ సహకార సంఘం లో యూరియా అందుబాటులో లేదని రైతులు మూడు రోజులుగా యూరియా బస్తాల కొరకు కార్యాలయం చుట్టూ తిరిగి పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆరు కాలం కష్టపడి పండించిన పంట పూతకు వస్తున్న సమయంలో యూరియా బస్తాలు అందక పత్తి మొక్కలు వాడిపోతున్నాయని, వరి పంట ఎరుపు రంగుకు వస్తుంద